E-PAPER

YouTube

  విశ్వకర్మ మహోత్సవ నిర్వహణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు.. ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్తు జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రమేశాచార్యులు..

విశ్వకర్మ మహోత్సవ నిర్వహణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు

ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్తు జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రమేశాచార్యులు

కేశవాపూర్ లో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

వాస్తవం – హుస్నాబాద్: విశ్వకర్మ జయంతి మహోత్సవ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు నిర్లక్ష్యం ఉట్టిపడుతోందని ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్తు జాతీయ ప్రధాన కార్యదర్శి,మీడియా ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ యువజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు అన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నిర్వహించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు చేయకపోవడం తగదన్నారు. శ్రీవిశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

– అన్న సంతర్పణను సెప్టెంబర్ 16,17తేదీల్లో దేశంలోని సర్వ మానవాళి,కార్మికులు, సంఘనేతలు నిర్వహించుకోవడం ఆనవాయితీ…ఈ నేపథ్యంలో

విశ్వసృష్టికి మూలాధారమైన శ్రీవిశ్వకర్మ భగవాన్ యజ్ఞమహోత్సవ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గల శ్రీ గాయత్రి మాత ఆశ్రమ సన్నిధిలో అక్కన్నపేట ఎస్సై ఎన్. విజయ భాస్కర్ సహకారంతో సోమవారం ‘విశ్వకర్మ హోమం’ అన్నసంతర్పణ (అన్న సమారాధన) నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తులు యజ్ఞ హోమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కాగా గత 18 సంవత్సరాలుగా సెప్టెంబరు 16,17 తేదీల్లో విశ్వకర్మ యజ్ఞం, ధ్వజారోహణ,అన్న సంతర్పణ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.గాయత్రి మాత ఆశ్రమములో నేడు సెప్టెంబర్ 17న, మను మయ తష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మ లకు సంబంధించిన పంచ రంగుల ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్, గాయత్రి మాత ఆశ్రమ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు వరియోగుల ప్రశాంత్ స్వామి సత్యనారాయణ చార్యులు మంత్రోచ్ఛరణ భక్తులను ఆకట్టుకుంది.కాగా రెండవ రోజు కొనసాగిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా

కేశవాపూర్ లో విశ్వకర్మ ధ్వజారోహణ నిర్వహించారు.

అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గల శ్రీ గాయత్రి మాత ఆశ్రమంలో శ్రీ విశ్వకర్మ జయంత్యోత్సవంలో భాగంగా సోమవారం మంగళవారం రెండు రోజుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మొదటి రోజున యజ్ఞ హోమ మహోత్సవం అన్నసంతర్పణ కార్యక్రమాలు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ గాయత్రి మాత ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు నిర్వహించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున శ్రీ విశ్వకర్మ ధ్వజారోహణ కార్యక్రమం గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బాల భక్తులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ గావించారు కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు