ది తెలంగాణ మిర్రర్, కోహెడ, ఆగస్టు 24:
కోహెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పుల్ల అభిలాష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో శనివారం రోజున సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ శుభాకాంక్షలు తెలిపారు అభిలాష్ మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందజేయగా అభినందించిన ఆమె శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి దరఖాస్తుపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా గ్రామాలలో పనిచేయని సీసీ కెమెరాలు గ్రామస్తులు వ్యాపారస్తులతో కలసి వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోహెడ క్రాస్ రోడ్ లో వాహనాల తనిఖీ
కోహెడ క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై పుల్ల అభిలాష్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు వాహన చోదకులు వాహనాలకు సరైన పత్రాలు తప్పకుండా వెంట తీసుకురావాలని పోలీసులు తనిఖీ చేసినప్పుడు వాటిని చూపించాలన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డ్రగ్ మాఫియా సమూలంగా నిర్మూలించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని ఎస్సై అభిలాష్ పేర్కొన్నారు