E-PAPER

YouTube

  సమ్మిళిత వృద్ధిని ప్రొత్సహించడం కోసమే మున్నూరు కాపు కార్పోరేషన్ ఏర్పాటు.. ప్రగతి పద్దు కింద రూ.50కోట్లు కేటాయించిన సర్కారు..

  • సమ్మిళిత వృద్ధిని ప్రొత్సహించడం కోసమే మున్నూరు కాపు కార్పోరేషన్ ఏర్పాటు
  • ప్రగతి పద్దు కింద రూ.50కోట్లు కేటాయించిన సర్కారు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌజ్ ఫెడ్ పూర్వ చైర్మన్ కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామన్న

ది తెలంగాణ మిర్రర్,కరీంనగర్/హుస్నాబాద్, ఆగస్టు24:

తెలంగాణ మున్నూరుకాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ కు

2024 సంవత్సరంలో జి.ఓ.ఎం.ఎస్.నెం. 19, బిసిడబ్ల్యు (డి) శాఖ, మార్చి 14న తెలంగాణ మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌస్ ఫెడ్ పూర్వ చైర్మన్,కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు.శనివారం రోజున శ్రీరామ్ మాట్లాడారు.

మున్నూరుకాపు సమాజంలోని పేద ప్రజల పై దృష్టి సారించి వారి సమ్మిళిత వృద్ధిని ప్రొత్సహించడం కోసమే కార్పోరేషన్ ప్రాథమిక లక్ష్యం అన్నారు.2024-25 సంవత్సరానికి తెలంగాణ మున్నూరుకాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ కోసం రూ.50కోట్లు ప్రగతి పద్దు క్రింద కేటాయించారని శ్రీరామ్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి,హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అఫిక్స్ కౌన్సిల్ తరఫున బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు