ది తెలంగాణ మిర్రర్,కోహెడ,జూలై 07:
భద్రాద్రి జిల్లా అశ్వరావుపెట ఏస్ ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి స్థాయి న్యాయ విచారణ చేపట్టాలని,ఎస్సై భార్య కుటుంబ సభ్యులు ఆరోపణల్లో వాస్తవాలుంటే నిజాలు నిగ్గుతేల్చాలని,తద్వారా దోషులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ప్రభుత్వాన్ని కోరారు.ఏస్ ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి రూ.ఒక కోటి పరిహారం ఇవ్వాలని అలాగే భార్యకు ఉద్యోగం ఇప్పించి పిల్లలకు మంచి విద్యను ప్రభుత్వమే అందించాలని రాజు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
Post Views: 25